ఇరాన్ లో భూకంపం.. నలుగురు మృతి

80చూసినవారు
ఇరాన్ లో భూకంపం.. నలుగురు మృతి
ఇరాన్ లోని ఈశాన్య నగరం కష్మార్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఈ ఘటనలో నలుగురు మరణించగా..120 మందికిపైగా గాయపడినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతతో కష్మార్ నగరం, సమీప గ్రామాల్లోని అనేక భవనాలు దెబ్బతిన్నాయని కష్మార్ గవర్నర్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్