మా వాళ్లను మాకివ్వండి.. డీఓపీటీకి ప్రభుత్వం లేఖ

57చూసినవారు
మా వాళ్లను మాకివ్వండి.. డీఓపీటీకి ప్రభుత్వం లేఖ
తమకు కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తమ రాష్ట్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అలాగే ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్ ఆఫీసర్లను రిలీవ్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వంలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల వ్యవహారాలను పర్యవేక్షించే డీఓపీటీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లను వెంటనే రిలీవ్ చేయాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్