మేఘాలయలో సోమవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. పశ్చిమ ఖాసీ హిల్స్లో 02:23 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.