బిహార్లో వాయుసేన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వరద సహాయ చర్యల్లో భాగంగా సీతామర్హి ప్రాంతంలో రిలీఫ్ మెటీరియల్ పంచి తిరిగొస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. ముజఫర్పూర్ నయాగ్రా వద్ద పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా వరద నీటిలోనే కుప్పకూలింది. ఆ సమయంలో అందులో నలుగురు ఎయిర్ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.