మల్కాజిగిరి నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ ఇవాళ అమిత్ షాతో భేటీ కానున్నారు. వీరి భేటీ అనంతరం ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈటల తొలుత కేంద్ర మంత్రి పదవి ఆశించగా.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈటలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.