తెలంగాణలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

54చూసినవారు
తెలంగాణలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా 525 మంది పోటీ చేశారు. 17 ఎంపీ స్థానాల్లో 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరగనుంది. 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్