హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 2022లో నమోదైన రోడ్డు ప్రమాద కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. రోడ్డు ప్రమాదంలో నిందితుడి పాత్ర ఉందనడానికి ఆధారాలున్నాయని, బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. దీంతో పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.