పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు

75చూసినవారు
పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు
హైదరాబాద్ లోని పాతబస్తీ భవానీనగర్ PS పరిధిలో బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలింది. స్థానిక అస్లాం ఫంక్షన్ హాల్ వద్ద ఓ వ్యక్తి బుల్లెట్ బండిపై వెళ్తుండగా ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ పేలింది. దీంతో భారీగా మంటలు వ్యాపించి బండి నడుపుతున్న వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. అతనితో పాటు మరో 9 మందికి కూడా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్