పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా స్పందించారు. పీఓకేను భారత్లో విలీనం చేస్తామని రాజ్నాథ్ సింగ్ ప్రకటనను ఫరూక్ అబ్ధుల్లా ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి ఇలా చెబితే ఇక ముందుకెళ్లడమే..వారిని ఆపడానికి మనం ఎవరని వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ కూడా గాజులు తొడుక్కుని కూర్చోలేదని గుర్తుంచుకోవాలన్నారు.