పంజాబ్పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం అందుకుంది. 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 139 పరుగులు చేసింది. రెండో ఓవర్ వేసిన దేశ్పాండే వరుస బంతులకు బెయిర్ స్టో (7, రూసౌవ్ (0)లను ఔట్ చేసి పంజాబ్ను చావుదెబ్బ కొట్టాడు. ప్రభ్సిమ్రన్ 30, శశాంక్ 27 మినహా ఎవరూ రాణించలేదు. జడేజా 3, దేశ్పాండే 2, సమర్జీత్ 2, శార్దూల్, సాంట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.