చెన్నై సూపర్ కింగ్స్కి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ మతిశా పతిరణ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు ఇవాళ పంజాబ్తో మ్యాచులోనూ బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకోవడానికి పతిరణ స్వదేశం శ్రీలంకకు బయల్దేరనున్నారు. మరోవైపు పంజాబ్తో మ్యాచులో చెన్నై 100కే 5 వికెట్లు కోల్పోయింది.