పాక్ ఆక్రమిత కశ్మీర్పై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్ ఏమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదని గుర్తుంచుకోవాలి. పాక్ వద్ద అణు బాంబు ఉంది. దురదృష్టవశాత్తూ ఆ అణుబాంబు మనపై పడుతుంది’ అని పేర్కొన్నారు. పీఓకేను భారత్లో విలీనం చేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటనను ఫరూక్ అబ్ధుల్లా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.