ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి మినీలారీ బోల్తా పడింది. ఏలూరు జిల్లా నుంచి జీడిపిక్కల లోడుతో తాడిమళ్లకు మినీ లారీ బయలుదేరింది. ఈ క్రమంలోనే చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకెళ్లింది. వాహనం తిరగబడిన సమయంలో ఏడుగురు మృతి చెందారు.