సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా వినాయక మండపం ఏర్పాటు.. ప్రశంసల జల్లు కురిపించిన సజ్జనార్‌

71చూసినవారు
సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా వినాయక మండపం ఏర్పాటు.. ప్రశంసల జల్లు కురిపించిన సజ్జనార్‌
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు వినాయక మండపాన్ని వినూత్నంగా రూపొందించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన వివరాలను ఫ్లెక్సీల్లో ప్రింట్ చేసి మండపానికి తోరణంగా ఏర్పాటు చేశారు. ఈ వీడియోను TGSRTC ఎండీ సజ్జనార్ "ఎక్స్"లో పోస్ట్ చేశారు. భక్తి భావంతో పాటు సమాజం హితం ఎంతో ముఖ్యమని ఈ అసోసియేషన్ గుర్తించడం గొప్ప విషయమన్నారు.

సంబంధిత పోస్ట్