కర్టాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామణి దగ్గర కారు ఢీకొని ప్రవేట్ ట్రావెల్స్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారు బెంగళూరు నుంచి తిరుపతి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.