కర్ణాటకకు చెందిన బీజేపీ అభ్యర్థి కే సుధాకర్పై లంచం కేసు నమోదు అయినట్లు ఇవాళ ఎన్నికల సంఘం తెలిపింది. అతని వద్ద నుంచి రూ.4.8 కోట్ల నగదును సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. చిక్కబల్లాపురాకు చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్ ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ వర్గాలు చెప్పాయి. కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.