తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై శుక్రవారం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్లపై ఇరువైపుల వాదనలు ముగిశాయి. కేసు దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు బృందం కోరింది. ఈమేరకు పంజాగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.