పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం అనంతరం ముగ్గురు రాజ్భవన్ అధికారులపై శనివారం FIR నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందోననే భయంతో ఈనెల 2న బాధితురాలు రాజ్భవన్ నుంచి బయటకు వెళ్లకుండా ఆ ముగ్గురూ అడ్డుకున్నట్లు చెప్పారు.