కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెంది వారు ముగ్గురున్నట్లు ఏపీ నాన్రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది.