దేశ రాజధాని ఢిల్లీలో షాహీన్బాగ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో జనాలు గుమిగూడారు. మరోవైపు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. 7 ఫైరింజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. ఎలక్ట్రికల్ వైర్లలో మంటలు మొదలై.. అనంతరం రెస్టారెంట్ కు వ్యాపించాయి. ప్రస్తుతం 7 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి.