బాక్సింగ్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు

76చూసినవారు
బాక్సింగ్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు
కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా అండర్-22 అండ్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు అదరగొట్టారు. యూత్ కేటగిరిలో భారత్ ఖాతాలో ఐదు స్వర్ణ పతకాలను చేర్చారు. పురుషుల విభాగంలో బ్రిజేశ్ (48 కేజీలు), ఆర్యన్ హుడా (51 కేజీలు), యశ్వర్ధన్ సింగ్ (63.5 కేజీలు).. మహిళల విభాగంలో లక్ష్మి (50 కేజీలు), నిషా (52 కేజీలు) ఆసియా చాంపియన్స్‌గా నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్