కేరళలోని మూన్నియూర్ పంచాయతీకి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి కలుషితమైన నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ అయిన అమీబిక్ మెనింగోన్సిఫాలిటీస్ (బ్రెయిన్ ఈటింగ్ అమీబా)తో సోమవారం రాత్రి మృతి చెందింది. బాధిత బాలిక మే 1న సమీపంలోని చెరువులో స్నానం చేసింది. దీంతో మే 10వ తేదీ నాటికి జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని కుటుంబసభ్యులు తెలిపారు. వైద్య చికిత్స అందించడం ఆలస్యం కావడంతో బాలిక చనిపోయింది.