ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

1912చూసినవారు
ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత
ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్ పడనుంది. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి తమ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆశా వెల్లడించింది. అలాగే, రూ.1,500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.

సంబంధిత పోస్ట్