కర్ణాటకలో మంగళూరులోని జిల్లా జైలులో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగు చూసింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 45 మంది ఖైదీలు వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒక ఖైదీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.