భారత ఆర్మీ తొలిసారిగా స్కిన్ బ్యాంకును ప్రారంభించింది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు తీవ్రమైన కాలిన గాయాలు, చర్మ సంబంధ చికిత్స అందించేందుకు దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కిన్ బ్యాంకులో ప్లాస్టిక్ సర్జన్లు, టిష్యూ ఇంజినీర్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులుసహా వైద్య నిపుణులు బృందం ఉంటుందని రక్షణ శాఖ మంగళవారం తెలిపింది. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ఈ స్కిన్ బ్యాంకును ప్రారంభించినట్టు పేర్కొంది.