మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థతకు గురయ్యారు. బీపీ, షుగర్ లెవెల్స్ తగ్గడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.
మోత్కుపల్లికి వెల్నెస్ ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఎంపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మోత్కుపల్లి గురువారం నిరసన దీక్ష చేపట్టారు.