ఎంఐఎం నేత, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ఖాన్ (75) మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్లోని మెహిదీపట్నం హుమాయున్నగర్ క్యాజిల్హిల్స్లో నివసిస్తున్న ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. మురాద్నగర్ కార్పొరేటర్గా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 1989లో తొలిసారిగా చార్మినార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో నాంపల్లి నుంచి బరిలో దిగి విజయం సాధించారు.