తిరుమలకి వెళ్లొస్తూ ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి

529చూసినవారు
తిరుమలకి వెళ్లొస్తూ ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ లోని జిల్లెలగూడకు చెందిన కెంపురావు(75), అశోక్(48), వెంకటరమణ(43), రామారావు(43)గా గుర్తించారు. వీరంతా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు రామారావు ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చారు.

సంబంధిత పోస్ట్