ఆదిలాబాద్లో కత్తులతో దాడి చేసుకున్న ఘటన భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఆర్థిక లావాదేవీల విషయంలో యువకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కత్తులతో నలుగురు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.