సద్దలోనిపల్లి శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో హుండీ చోరీ
జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం సద్దలోని పల్లి గ్రామంలో శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో హుండీ పగలగొట్టి పట్టపగలే మూడు నుంచి నాలుగు లక్షల వరకు దొంగతనం జరిగినట్టు ఆలయ చైర్మన్ రామకృష్ణ తెలిపారు. పూజారి ఆలయ చైర్మన్ కు చోరీ జరిగిన విషయం వెంటనే తెలుపకుండా, ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని ఆలస్యంగా తెలపడంతో పూజారి పై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.