మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు

72చూసినవారు
మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు
మల్దకల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సదస్సును మల్దకల్ ఏఎస్ఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాకుండా, కుటుంబ కలహాలు, కుటుంబాలు చెదిరిపోవడానికి ప్రధాన కారణమని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలను ఉపయోగించకూడదని విద్యార్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్