తెలంగాణల
ో గత ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యారంగం అస్తవ్యస్తమైందని రాష్ట్
ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో రూ, 8 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులతో కలిసి శనివారం మంత్రి జూపల్లి సహపంక్తి భోజనం చేశారు.