కృష్ణా రెడ్డి పార్థివ దేహానికి జి. చిన్నారెడ్డి నివాళులు

79చూసినవారు
కృష్ణా రెడ్డి పార్థివ దేహానికి జి. చిన్నారెడ్డి నివాళులు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తండ్రి గవినోళ్ల కృష్ణారెడ్డి గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామానికి చేరుకొని కృష్ణారెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని పరామర్శించి ఓదార్చారు. అనంతరం కృష్ణారెడ్డి అంత్యక్రియలలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్