యూపీలోని లాల్గంజ్లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. లాల్గంజ్ వంతెనపై నుంచి 17 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా నదిలో దూకింది. కాసేపటికే ఆమె నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుండగా వంతెనపై నుంచి కొందరు వీడియో తీశారు. అయితే ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. ఆమె వివరాల కోసం ఆరా తీస్తున్నారు.