గుజరాత్ అహ్మదాబాద్లో దారుణం జరిగింది. ప్రియుడు జై తన నెంబర్ బ్లాక్ చేశాడని రింకీ అనే మహిళ అతనిపై కారు ఎక్కించి కత్తితో పొడిచింది. 13 ఏళ్ల క్రితం వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది. దీంతో తరచు ఫోన్ లో మాట్లాడుకునే వారు. అయితే చిన్న గొడవ కారణంగా అతను ఆమె నంబర్ బ్లాక్ చేశాడు. దీంతో పగ పెంచుకున్న ప్రేయసి ఫిబ్రవరి 25న ఈ దారుణానికి పాల్పడింది. ఆమెనుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.