ముంబై దాడుల సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాది, గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పాకిస్థాన్లో మరణించాడు. ఆయన పాకిస్థాన్లోని లాహోర్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అధిక మధుమేహంతో చికిత్స పొందుతూ.. గుండెపోటుకు గురికావడంతో శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. కాగా, మక్కీ లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ)కి డిప్యూటీ చీఫ్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.