మహారాష్ట్రలోని పుణెలో ఈ నెల 14న షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాల ముగిసిన తర్వాత పదేళ్ల బాలుడు ఇంటి వద్ద గ్రౌండ్లో సైకిల్ తొక్కుకుంటున్నాడు. ఆ సమయంలో ఓ కారు డ్రైవర్ ఆ బాలుడిని ఢీకొట్టాడు. కింద పడ్డ బాలుడి పై నుంచి కారును పోనిచ్చాడు. దీంతో కారు చక్రాల కింద నలిగి ఆ బాలుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.