దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారంతో పోలిస్తే.. శనివారం స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 200 పెరిగి.. రూ. 83,600 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 220 పెరగడంతో.. రూ. 91,200 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి.. రూ.1,13,000 గా కొనసాగుతుంది.