భారత్లోని ఐఫోన్ తయారీ ప్లాంట్లలో పనిచేసే 78వేల మంది ఉద్యోగులకు ఇళ్లు నిర్మించాలని యాపిల్ సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్ట్కు కొంతమేర నిధులు అందించనున్నాయి. తయారీదారులైన ఫాక్స్కాన్, టాటా, శాల్కాంప్ సంస్థల ఉద్యోగులకు ఈ ఇళ్లు నిర్మించనున్నారు. మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నారట. కాగా చైనాలోనూ యాపిల్ ఇదే తరహాలో ఉద్యోగులకు ఇళ్లు నిర్మించింది.