AP: ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రాయితీ కింద ప్రభుత్వం రూ.3.93 కోట్లు విడుదల చేసింది. అర్హులైన రైతులకు రాయితీ కింద వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనుంది. పవర్ టిల్లర్కు రూ. లక్ష, పవర్ స్ప్రేయర్కు రూ. 8 వేలు, బ్యాటరీకు రూ. వెయ్యి చెప్పున సబ్సిడీ అందనుంది. వీటతో పాటు.. రొటావేటర్కు రూ. 46 వేలు, నాగళ్లకు రూ. 27,800 చొప్పున రైతులకు రాయితీ లభిస్తుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేది మార్చి 31గా పేర్కొన్నారు.