ముంబై ఇండియన్స్ జట్టులోని యువ బౌలర్, కేరళ కుర్రాడు విఘ్నేశ్ ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లో అదరగొడుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున బౌలింగ్ చేస్తున్న విఘ్నేశ్ ఈ మ్యాచ్లో ఇప్పటి దాఖలా మూడు వికెట్లు పడగొట్టాడు. విఘ్నేశ్ వేసిన 11.4 ఓవర్కు దీపక్ హుడా (3) సత్యనారాయణ రాజుకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దానికి ముందు విఘ్నేశ్ చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబేలను కూడా ఔట్ చేశాడు.