ఎగ్జామ్‌ పేపర్ లీక్.. పరీక్షలను రద్దు చేసిన ఇంటర్ బోర్డు

69చూసినవారు
ఎగ్జామ్‌ పేపర్ లీక్.. పరీక్షలను రద్దు చేసిన ఇంటర్ బోర్డు
ఇంటర్ ఎగ్జామ్‌ పేపర్‌ లీకైనట్లు వార్తలు రావడంతో ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది ఇంటర్ బోర్డు. బీజేపీ పాలిత అస్సాం రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. మార్చి 21న ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది. అయితే ఆ పేపర్ లీక్ అయినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అస్సాం హైయర్‌ సెకండరీ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 21న జరగాల్సిన ఎగ్జామ్‌తో పాటు మార్చి 29 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేసింది.

సంబంధిత పోస్ట్