AP: రాష్ట్రంలో సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఉపరితర ఆవర్తన ద్రోణి ప్రభావంతో రేపు కూడా చిత్తూరు, ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, మన్యం జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.