పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకాన్ని ప్రవేశపెట్టింది. జన్ ధన్ ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డ్ ఇవ్వబడుతుంది. ఈ కార్డుపై రూ. 2 లక్షలు ఉచిత ప్రమాద బీమా, జీవిత బీమా కింద రూ. 30 వేలు ఇస్తారు. ఖాతాదారులు ఆకస్మికంగా మరణిస్తే, వారి కుటుంబ సభ్యులు ఈ నగదును ఉచితంగా పొందుతారు. ఈ ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ కార్డ్ లింక్ తప్పనిసరి. వెబ్సైట్ లింక్: https://pmjdy.gov.in/