మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని టీఎస్ఆర్టీసీ ఇంటికే హోం డెలివరీ చేయనుంది. ఇందుకోసం భక్తులు రూ.299 చెల్లించి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఆర్డర్ ఇవ్వాలని పేర్కొంది. ఈనెల 25వ తేదీ వరకు బుకింగ్ చేసుకోవచ్చు. జాతర అనంతరం ప్రసాదంతో పాటు పసుపు కుంకుమలు కార్గో సేవల ద్వారా ఇంటికే పంపించనుంది. వివరాలకు 040-23450033, 040-69440000 నంబర్లకు సంప్రదించండి.