రాజస్థాన్లో ఘోర ప్రమాదం తప్పింది. బొలెరోను గూడ్స్ రైలు ఢీకొట్టింది. సూరత్గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించే క్రమంలో పట్టాలను క్రాస్ చేస్తుండగా ఆగిపోయింది. అదే సమయంలో గూడ్స్ రైలు వేగంగా వచ్చి బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదలో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా జవాన్ కారులో నుంచి దూకేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.