తెలంగాణలో ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలని.. వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. అటు విద్యా సంవత్సరం ప్రారంభానికి సన్నాహాలపై సీఎస్ సమీక్ష చేపట్టారు. జూన్ 12లోపు అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయాలని సూచించారు. బడులు ప్రారంభమైన రోజే పాఠ్య పుస్తకాలు, యునిఫాంలు ఇవ్వాలని ఆదేశించారు.