తెలంగాణలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌!

77చూసినవారు
తెలంగాణలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌!
యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌ (ఎన్​ఎంసీ)ను ఆదేశించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం లేఖ పంపింది. ఒక్కో కాలేజీలో‌‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్