చెన్నైలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. బీజేపీ మహిళా నేత నదియా భర్త శ్రీనివాసన్ తన ఫ్రెండ్స్ను కలిసేందుకు అన్నానగర్కు వెళ్లాడు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. అకస్మాత్తుగా శ్రీనివాసన్పై దాడి చేశారు. కొడవళ్లతో ఆయనను నరికారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసన్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసన్ చనిపోయాడు. హత్యకు సంబంధించిన వీడియో నెట్టింట వెలుగులోకి వచ్చింది.