ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్గా పని చేస్తున్న గణపతి లక్ష్మీ అనే మహిళ బుధవారం ఉదయం రిమ్స్లోనే పినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చీఫ్ సూపర్వైజర్గా పని చేస్తున్న బియ్యాల రవి గత కొన్ని రోజులుగా పలువురు పేషెంట్ కేర్ సిబ్బందిని మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు తెలిపింది. వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు చెప్పింది.